'టీడీపీ కక్ష సాధింపులకు పాల్పడుతోంది'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మండిపడ్డారు. కర్నూలు జిల్లా నంద్యాల కౌన్సిల్ సమావేశ ఘటన వ్యవహారం ప్రభుత్వ నియంత పాలనను రుజువు చేస్తోందని విమర్శించారు.
టీడీపీ కౌన్సిలర్లు వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లపై దాడి చేస్తే ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని విజయసాయి రెడ్డి చెప్పారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.