రేపటి నుంచి వి-శాట్ ప్రవేశ పరీక్ష


చేబ్రోలు: బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ నిర్వహించే వి-శాట్ ప్రవేశ పరీక్ష ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు జరుగుతుందని వర్సిటీ అడ్మిషన్స్ డెరైక్టర్ ఆర్.వెంకటనాథ్ మంగళవారం తెలిపారు. 21 పట్టణాల్లోని 23 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని 31,210 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. ఆన్‌లైన్‌లో జరిగే పరీక్ష కోసం 31 వేల మంది విద్యార్థులకు హాల్ టికెట్లు పంపించామని పేర్కొన్నారు.



వి-శాట్ ఫలితాలను మే నెల మొదటివారంలో ప్రకటించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఈ కోర్సుల్లో ప్రవేశానికి ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు అర్హులని ఆయన తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top