మహిళపై అత్యాచారం ఆపై వీడియో


ఎడ్లపాడు(గుంటూరు): మహిళపై అత్యాచారం చేసి ఆ దృశ్యాన్ని వీడియో తీసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడులో జరిగింది. వివరాలు.. రెండు నెలల క్రితం అంకమ్మరావు, మహేంద్రలు ఒక వివాహితను అత్యాచారం చేసి, ఆ దృశ్యాన్ని వీడియో తీశారు.


అనంతరం ఆ వీడియోని బ్లూటూత్ ద్వారా ఊర్లో వారందరితో పంచుకున్నారు. ఈ క్రమంలో విషయం తెలిసిన బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top