సులభంగా శ్రీవారి దర్శనం


తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. సర్వదర్శనం భక్తులకు ఆరు గంటల్లోనే శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం లభించింది. కాలిబాట భక్తులకు 3 గంటల సమయం పట్టింది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 42,248 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం హుండీలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.47 కోట్లు లభించాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top