బాలిక గొంతు కోశారు


తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నెల్లిపాక మండలం రాజపేటలో గుర్తు తెలియని కొందరు దుండగులు ఎనిమిదేళ్ల బాలిక గొంతు కోశారు. దీంతో ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం బాలికను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దుండగులు ఎవరై ఉంటారు.. తెలియనివారా, తెలిసిన వారు అసలు ఎందుకు ఈ చర్యకు వారు పాల్పడ్డారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top