బడ్జెట్లో ఏపీ రాజధాని నిధుల మాటేది?
హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని వైఎఎస్ఆర్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు సోమయాజులు అన్నారు. ఈ బడ్జెట్లో చెప్పుకోదగ్గ అంశాలేమి లేవని ఆయన అన్నారు. ఏపీ రాజధాని నిర్మాణ నిధుల గురించి కూడా బడ్జెట్లో లేదని సోమయాజులు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైల్వే బడ్జెట్ మాదిరి పాలసీ మేకింగ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు.
పోలవరానికి కేటాయించిన బడ్జెట్ నిధులు చూస్తుంటే ఇక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కానట్టేనని చెప్పారు. టీడీపీ, బీజేపీల మధ్య ఒప్పందం మేరకే పోలవరం పక్కన పెట్టి పట్టిసీమ ప్రాజెక్ట్ కడుతున్నారని ఆయన అన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల వివరాలు ఇప్పటికీ వెల్లడించలేదన్నారు. కాగా, 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను శనివారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.