బాబు పాలనలో డొల్లతనం రుజువైంది

బాబు పాలనలో డొల్లతనం రుజువైంది - Sakshi


సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ నేతల హత్యల వంటి దుర్మార్గాలతో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎంతో కాలం పరిపాలన సాగించలేదని ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.



చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్ష నేతలను వేధించేది చాలక ఇంకా ఇలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలను హతమార్చడం దారుణమని, ఇలాంటి దురాగతాలను ప్రజలు చూస్తూ సహిస్తారనుకోవడం పొరబాటేనని ఆయన అన్నారు. నారాయణరెడ్డి హత్య కేసు విచారణ, నిందితులను పట్టుకోవడంలో పోలీసు అధికారులు తమ నిష్పాక్షికతను నిరూపించుకోవాలని, టీడీపీ ప్రభుత్వం కూడా నిష్పాక్షికంగా దోషులకు శిక్ష పడేలా వ్యవహరించాలని ఉమ్మారెడ్డి డిమాండ్‌ చేశారు. శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలనలో డొల్లతనం ఈ హత్యతో రుజువైందని ఆయన అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top