గోడకూలి ఇద్దరు తాపీ మేస్త్రీలు మృతి


ఎస్‌.కోట(విజయనగరం):  నిర్మాణం లో ఉన్న గోడ కూలి  ఇద్దరు తాపీ మేస్త్రీలు  మృత్యువాత పడ్డారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలం సీతంపేటకు చెందిన పూడి ఈశ్వరరావు(26), నాగభూషణం(25) తాపీ మేస్త్రీలు.



సోమవారం పోతనాపల్లిలో గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా గోడ నిర్మిస్తున్నారు. అయితే, గోడ పటిష్టం కాకపోవటంతో నిర్మిస్తుండగానే కూలింది. ఇటుకలు మీద పడటంతో తాపీ మేస్త్రీలు అక్కడికక్కడే మృతిచెందారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top