ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరి మృతి
వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. దిమ్మిలి నుంచి రాజకోడూరు వెళ్తున్న ట్రాక్టర్ పంచదార సమీపంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది.
దీంతో ట్రాక్టర్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మృతుల వివరాలు తెలియ రాలేదు.