లారీని ఢీ కొన్న లారీ: డ్రైవర్, క్లీనర్ మృతి
ఒంగోలు : ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు మండలం దొడ్డవారిపాడు జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి పక్కనే ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్తోపాటు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకుని.... పోస్ట్మార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.