ఈతకెళ్లి ఇద్దరు గల్లంతు


గోపవరం(వైఎస్సార్ జిల్లా): వాగులో ఈతకెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం రాత్రి వైఎస్సార్‌జిల్లా గోపవరం మండలం బ్రహ్మణపల్లి గ్రామంలో జరిగింది. వివరాలు..గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య-లక్ష్మీదేవి దంపతుల కుమారుడు శ్రీను(8) అదే గ్రామానికి చెందిన వెంకటరమణ కుమారుడు కృష్ణ(8) సాయంత్రం తుమ్మలవంకవాగులో ఈతకెళ్లారు. రాత్రైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పిల్లల ఆచూకీ కోసం గాలించారు.


 


ఈ క్రమంలోనే వాగు వద్ద పిల్లల దుస్తులను చూసి వారు ఈతకెళ్లినట్లు గుర్తించారు. అనంతరం వాగులో ఉన్న పిల్లల మృతదేహాలను వెలికితీశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈత కెళ్లిన ఇద్దరు బాలురు మృతి చెందడంతో గ్రామంలో విశాద చాయలు అలుముకున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top