అనంతలో రోడ్డు ప్రమాదం:ఇద్దరి మృతి
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ సమీపంలోని అనంతలక్ష్మీ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకుపై వస్తున్న ఇద్దరు వ్యక్తులను కర్ణాటకకు చెందిన ఓ కారు బలంగా ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. కాగా, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.