బస్సు,ఆటో ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు


విజయనగరం : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్ర  గాయాలయ్యాయి. ఈ సంఘటన విజయనగరం మండలం వేటగడ్డ వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.  నెల్లిమర్ల నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న లత,  కృష్ణవేణి అనే ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  క్షతగాత్రులిద్దరు నెల్లిమర్లకు చెందినవారుగా గుర్తించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top