నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు


సుండుపల్లి (వైఎస్సార్ జిల్లా) : అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న స్థావరాలపై పోలీసులు దాడిచేసిన సంఘటన వానరాసపల్లి అటవీ సమీపంలో మంగళవారం జరిగింది. ఎక్సైజ్ పోలీసులు ఈ దాడుల్లో సుమారు 1200 లీటర్ల ఊట బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 70 లీటర్ల నాటుసారా కూడా స్వాధీనం చేసుకున్నారు. నాటు సారా కాస్తే కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top