కాల్వలో పడి ఇద్దరు బాలికలు మృతి
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా కసింకోట మండలం పరవాడపాలెంలో విషాదం చోటు చేసుకుంది. పోలి పాడ్యమి పూజల్లో భాగంగా ఏలేరు కాల్వలో దీపాలు వదిలేందుకు వెళ్లన ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు కాల్వలో జారిపడి మరణించారు. మృతులు నాగమ్మ(9), సాయిలక్ష్మీ(14)గా గుర్తించారు.
స్థానికులు వెంటనే స్పందించి ఆ బాలికల మృతదేహాలను కాల్వ నుంచి వెలికితీశారు. కాగా బాలికల మృతిపై వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సాయిలక్ష్మీ మరణవార్త విన్న ఆమె తల్లి కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.