రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి


పూసపాటిరేగ ( విజయనగరం): లారీ, బైకు ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా కందివలస జాతీయ రహదారిలో శనివారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. ఇద్దరు యువకులు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా మార్గమధ్యంలో కందివలస వద్ద లారీని ఢీకొట్టారు.



ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న వారిద్దరికీ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరు శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పెనుబాకకు చెందిన కంచిరెడ్డి సత్యనారాయణగా గుర్తించారు. మరొకరి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top