రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మేదరమెట్ల: ప్రకాశం జిల్లా పంగులూరు మండలం ముప్పవరం సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆగి ఉన్న టిప్పర్ను, ట్యాంకర్ ఢీకొనగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు గుంటూరు జిల్లాకు చెందిన వారిగా భావిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు.