రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి


ప్రకాశం: పాల ట్యాంకర్‌ను మినీ వ్యాన్ ఢీ కొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఓ నవవధువు కూడా ఉన్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొరిశపాడు వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. విశాఖపట్టణానికి చెందిన ఓ కుంటుంబ తిరుపతి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న వ్యాన్ పాల ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. వైద్యం అందిస్తుండగా.. మరో ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top