పిడుగుపాటుతో ఇద్దరి మృతి


సత్తెనపల్లి (గుంటూరు): పిడుగుపాటుతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెన పల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని రెంటపాళ్ల గ్రామంలోని పంట పొలాల్లో పిడుగు పడింది. ఆ సమయంలో పొలంలో పనిచేస్తున్నఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top