పిడుగుపాటుతో ఇద్దరి మృతి
సత్తెనపల్లి (గుంటూరు): పిడుగుపాటుతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెన పల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని రెంటపాళ్ల గ్రామంలోని పంట పొలాల్లో పిడుగు పడింది. ఆ సమయంలో పొలంలో పనిచేస్తున్నఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.