దైవదర్శనానికి వెళుతూ ప్రాణాలు కోల్పోయారు!


తిరుపతి:చిత్తూరు జిల్లా పాకాల మండలం నేండ్రగుంట వద్ద ఒక లారీ పాదచారులపై దూసుకెళ్లింది. ఇద్దరు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.



 తమిళనాడుకు చెందిన భక్తులు తిరుమలలో శ్రీవెంకటేశ్వరుని దర్శనానికి కాలినడకన వెళుతుండగా ఈ  ప్రమాదం జరిగింది. మృతులు ఇద్దరూ తమిళనాడులోని వేలూరుకు చెందిన  వేణు, సంతోష్గా గుర్తించారు.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top