దైవదర్శనానికి వెళుతూ ప్రాణాలు కోల్పోయారు!
తిరుపతి:చిత్తూరు జిల్లా పాకాల మండలం నేండ్రగుంట వద్ద ఒక లారీ పాదచారులపై దూసుకెళ్లింది. ఇద్దరు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
తమిళనాడుకు చెందిన భక్తులు తిరుమలలో శ్రీవెంకటేశ్వరుని దర్శనానికి కాలినడకన వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు ఇద్దరూ తమిళనాడులోని వేలూరుకు చెందిన వేణు, సంతోష్గా గుర్తించారు.
**