గోదావరిలో దూకిన సోదరులు


కొవ్వూరు (పశ్చిమగోదావరి జిల్లా) : గోదావరి నదిలో దూకి ఓ వ్యక్తి గల్లంతు కాగా, అతడి ఆచూకీ లభించలేదన్న మనస్తాపంతో సోదరుడు కూడా గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు రోడ్ కమ్ రైలు వంతెన దగ్గర శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొవ్వూరు పట్టణంలోని యానాదికాలనీకి చెందిన కోన శ్రీధర్ (28) శుక్రవారం ఉదయం వంతెనపై నుంచి గోదావరిలో దూకేశాడు. అతడి కోసం జాలర్లు గాలింపు చేపట్టారు.



అయితే మధ్యాహ్నం వరకూ ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో సోదరుడు చనిపోయి ఉంటాడని భావించిన కోన మహేందర్(46) మనస్తాపంతో మధ్యాహ్నం సమయంలో వంతెనపై నుంచి గోదావరిలో దూకేశాడు. ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ సాయంత్రం వరకూ ఎలాంటి ఆచూకీ లభించలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top