దొంగనోట్లు స్వాధీనం : ఇద్దరు అరెస్ట్
రాయదుర్గం రూరల్ (అనంతపురం) : అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో దొంగనోట్లు చెలామణీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని వేపరాల గ్రామానికి చెందిన సత్తార్ సాహెబ్, ముల్లాపీరా అనే వారు స్థానిక కనేకల్ క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం సాయంత్రం అనుమానాస్పదంగా తిరుగుతుండగా సీఐ భాస్కర్రెడ్డి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.50 విలువ కలిగిన 100 నోట్లను స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు