మద్యం మాఫియా రాకెట్‌లో ఇద్దరి అరెస్ట్


సంతమాగులూరు: ప్రకాశం జిల్లా సంతమాగులూరులో మద్యం మాఫియాకు సంబంధించి ఇద్దరు కీలక నిందితులను అద్దంకి ఎక్సైజ్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. 2013 ఆగస్టు 11న సంతమాగులూరులో భారీగా పట్టుబడిన అక్రమ మద్యం కేసులో వీరు నిందితులుగా ఉన్నారు.


అదే నెలలో నమోదైన మూడు మద్యం మాఫియా కేసులకు సంబంధించి 15 మంది నిందితులకు గాను 13 మందిని లోగడే అరెస్ట్ చేయగా, వీరంగి రవీంద్రారెడ్డి, జలంపల్లి నరేంద్రారెడ్డిలను తాజాగా అరెస్ట్ చేశారు. వీరు మద్యం సరఫరా ఏజెంట్లుగా వ్యవహరించినట్లు సమాచారం.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top