శ్రీపతి చిత్రంపై అపోహలొద్దు: టీటీడీ పీఆర్వో
సాక్షి, తిరుమల: టీటీడీ డైరీ-2015లో ప్రచురించిన శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మితో కూడిన చిత్రం ముమ్మాటికీ శ్రీపతిదేనని, దానిపై భక్తులు అపోహ చెందవద్దని టీటీడీ పీఆర్వో తలారి రవి సోమవారం ఒక వివరణ ఇచ్చారు. టీటీడీ వద్ద ఉండే గ్రంధాల ఆధారంగా శ్రీపతి చిత్రాన్ని ప్రచురించామన్నారు.
దానిపై అనుమానాలుంటే తమను సంప్రదిస్తే ఆధారాలు చూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భక్తుల మనోభావాలతో కూడిన సున్నితమైన, ధార్మికపరమైన విషయాలపై ఎలాంటి గందరగోళం సృష్టించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.