'అధికార, ప్రతిపక్షాలు కలిసి పోరాడాలి'
రాజమండ్రి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా పోరాడాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ టీడీపీ, వైఎస్సార్సీపీలను కోరారు.
గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం అవసరమైతే మంత్రులు, ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసేందుకు కూడా సిద్ధపడాలని హితవు పలికారు.