రాజమండ్రిలో పేలిన ట్రాన్స్ఫార్మర్
తూర్పుగోదావరి: రాజమండ్రి రూరల్ మండలంలోని బొంగూరు గ్రామంలో ఉన్న 220 కేవీ సబ్స్టేషన్లో ప్రమాదవశాత్తూ బుధవారం ట్రాన్ఫార్మర్ పేలింది. ఈ ఘటనతో సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ పేలడంతో మండల పరిధిలోని 13 గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టారు.
(రాజమండ్రి రూరల్)
సంబంధిత వార్తలు