నంద్యాల డీఎస్పీపై బదిలీ వేటు
కర్నూలు: నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఓఎస్డీ రవిప్రకాష్కు బాధ్యతలు అప్పగించింది. కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలంలో డీఎస్పీగా పనిచేస్తున్న ఈయన ఉప ఎన్నిక నోటిఫికేషన్కు ముందు మంత్రి భూమా అఖిలప్రియ సిఫారసుతో జూలై 4న హరినాథరెడ్డి స్థానంలో డీఎస్పీగా నియమితులయ్యారు. అప్పట్నుంచీ అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతల్ని వేధింపులకు గురిచేస్తున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
కాగా, ఉప ఎన్నిక ప్రచారం కోసం సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నంద్యాలకు భారీగా డబ్బులొస్తున్నాయని సమాచారమందడంతో ఓ కంటైనర్ను ఎన్నికల నిఘా విభాగం శుక్రవారం పోలీసులకు అప్పగించింది. దాన్ని తనిఖీ చేశాక సంబంధిత నివేదికను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పజెప్పాల్సిన డీఎస్పీ గోపాలకృష్ణ.. అసత్య ఆరోపణలు చేస్తే కేసులు పెడతానంటూ ప్రతిపక్ష పార్టీ నేతల్ని బెదిరించడం వార్తలకెక్కింది.