రేపు కృష్ణా జిల్లాకు వైఎస్ జగన్

రేపు కృష్ణా జిల్లాకు వైఎస్ జగన్ - Sakshi


అంతు చిక్కని వ్యాధి ప్రబలిన కొత్తమాజేరు సందర్శన



హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అంతు చిక్కని వ్యాధి ప్రబలిన కొత్తమాజేరు గ్రామాన్ని ఆయన సందర్శిస్తారు. వ్యాధి కారణంగా ఈ గ్రామంలో 20 మంది చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదనే వార్తలు వస్తున్నాయి.



విషయం తెలుసుకున్న కృష్ణా జిల్లా పార్టీ నేతలు కొత్త మాజేరుకు వెళ్లి స్థానికంగా నెలకొన్న పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జగన్ ఆ గ్రామాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం ఉదయం 8.30 గంటలకు విజయవాడకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా కొత్తమాజేరుకు వెళతారని పార్టీ కార్యక్రమాల కమిటీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ఆదివారం తెలిపారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top