శ్రీవారిని దర్శించుకున్న నటి స్వాతి
తిరుమల: తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం సినీ నటి స్వాతి దర్శించుకుంది. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తల్లితో కలిసి ఆమె స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు స్వాతికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.