నేడు వైఎస్ జగన్ రేణిగుంటకు రాక
హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి...
రోడ్డు మార్గాన నెల్లూరుకు...
{పత్యేక హోదా కోసం ఆత్మహత్యకు పాల్పడిన లక్ష్మయ్య కుటుంబానికి పరామర్శ
తిరుపతి: వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి రానున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం 8గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరి 9 గంటలకు రేణిగుంటకు చేరుకొంటారని తెలిపారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు బయల్దేరి వెళతారు.
ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణం చేసుకొన్న రామిరెడ్డి లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడ నుంచి బయలుదేరి రేణిగుంటకు చేరుకొని మధ్యాహ్నం 2.30 గంటల విమానానికి హైదరాబాద్ వెళతారు. పార్టీ అధినేతకు స్వాగతం పలికేందుకు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు రేణిగుంటకు తరలి రానున్నారు.