టుడే అప్డేట్స్ ఇవే....
* ఓటుకు కోట్లు కేసులో సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు నేటితో ముగియనున్న ఏసీబీ నోటీసు గడువు
* సండ్రకు రెండోసారి, జిమ్మిబాబుకు తొలిసారి నోటీసులు జారీ చేసిన ఏసీబీ
*ఏసీబీ విచారణకు సండ్ర హాజరవుతారా? లేదా అనేదానిపై ఉత్కంఠ
*సాయంత్రం 5 గంటలకు ముగియనున్న ఏసీబీ ఇచ్చిన నోటీసు గడువు
* జపాన్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండోరోజు పర్యటన
* పుజి ఎలక్ట్రిక్ ప్రతినిధులతో చంద్రబాబు బృందం భేటీ, ఊఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం
* కృష్ణాజిల్లాలో ప్రబలిన విష జ్వరాలు, జ్వరంతో బాధపడుతున్న 600 మంది
* బాధితులకు మెరుగైన వైద్యానికి మంత్రి దేవినేని ఉమ ఆదేశం
* శేషాచలం ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్పై నేడు హైకోర్టులో విచారణ
*నేడు నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన
*తెలంగాణ మున్సిపల్ కార్మికుల సమ్మెబాట, వేతన సవరణపై డిమాండ్
*మల్కన్గిరి, విశాఖ, కోరాపుట్ డివిజన్ లో నేడు, రేపు మావోయిస్టుల బంద్
* సెక్షన్-8పై నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్న ఏపీ మంత్రులు
* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి (సోమవారం) నుంచి 13 వరకు ఉబ్జెకిస్థాన్, ఖజకిస్థాన్, రష్యా, తుర్క్మెనిస్థాన్, కర్గీజ్స్థాన్, తజకిస్థాన్ దేశాల్లో మోదీ పర్యటించనున్నారు.
సంబంధిత వార్తలు