నేటి ముఖ్య వార్తలు
ఉప ఎన్నిక ప్రచారం
♦ నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉప ఎన్నిక ప్రచారం 12వ రోజుకు చేరుకుంది. సలీంనగర్ నుంచి నేడు వైఎస్ జగన్ రోడ్ షో ప్రారంభం కానుంది.
♦ నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన రెండు రోజుకు చేరకుంది.
మారథాన్ రన్
హైదరాబాద్ కమీషనర్ సీపీ మహేందర్ రెడ్డి ఇవాళ ఉదయం జెండా ఊపి మారథాన్ రన్ను ప్రారంభించారు. పీపుల్స్ ప్లాజా నుంచి బాలయోగి స్టేడియం వరకు జరిగిన ఈ రన్లో 20 వేల మందికి పైగా పాల్గొన్నారు. ఈ రన్ కారణంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
తమిళ రాజకీయం
నేడో, రేపో పన్నీర్ సెల్వం, పళనీ స్వామిల వర్గాల విలీనంపై ప్రకటన చేయనున్నారు.
తొలి వన్డే
భారత్-శ్రీలంక ఐదు వన్డేల సిరీస్లో భాగంగా నేడు తొలివన్డే జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలనుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది.
ప్రోకబడ్డీ
నేడు జరిగే మ్యాచ్ల్లో పట్నా పైరేట్స్తో పుణేరి పల్టన్, యూపీ యోధతో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి.