నేటి ముఖ్యవార్తలు..
ఎన్నికల ప్రచారం
నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తరపున పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారం పదో రోజుకు చేరుకుంది. నేడు సాయిబాబానగర్ ఆర్చి సెంటర్ నుంచి వైఎస్ జగన్ రోడ్ షో ప్రారంభంకానుంది.
పొలవరం
ఇవాళ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఉదయం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశంకానుంది. అనంతరం పోలవరాన్ని సందర్శించనుంది.
స్టాండింగ్ కమిటీకి పోలవర నిర్మాణాన్ని చంద్రబాబు వివరించనున్నారు.
సీఎం పర్యటన
నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతిలో పర్యటించనున్నారు.
అగ్రిగోల్డ్
ఇవాళ విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులు సమావేశంకానున్నారు.
వర్ష సూచన:
అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి నాలుగురోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
తమిళ రాజకీయం
నేడు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన వర్గం ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.
ఇవాళ బెంగళూరు జైల్లో శశికళతో దినకరన్ భేటీకానున్నారు.
నేటి పెట్రోల్ ధరలు
ఇవాళ పెట్రోల్ ధర ఆరు పైసలు పెరగగా, డీజిల్ ధర 12 పైసలు తగ్గింది. హైదరబాద్లో నేటి పెట్రోల్ లీటర్ రూ. 72.31, డీజిల్ రూ.62.23
ప్రోకబడ్డీ
నేటి మ్యాచ్ల్లో యూపీ యోధతో యు ముంబా, బెంగళూరు బుల్స్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి.