కరెంటు మీటర్ చెక్ చేయాలని వచ్చి..
విద్యుత్ మీటర్ చెక్ చేయాలని ఇంట్లోకి వచ్చిన ఓ అగంతకుడు.. కత్తితో బెదిరించి దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక పరివర్తన పాఠశాల సమీపంలోని ఓ ఇంట్లోకి ఈ రోజు మధ్యాహ్నం సమయంలో విద్యుత్ మీటర్ చెక్ చేయాలని ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో పురుషులు ఎవరు లేనిది చూసి పసిపాప మెడపై కత్తి పెట్టి ఇంట్లో ఉన్న మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దీంతో మహిళ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.