తిరుపతిలో హై అలెర్ట్


సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఉగ్రవాదులు తిరుపతిలో మకాం వేసుండొచ్చని ఎన్‌ఐబీ(నేషనల్ ఇంటెలిజె న్స్ బ్యూరో) వర్గాలు అనుమానం వ్యక్తం చేయడం తో అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టి హైఅలెర్ట్ ప్రక టించారు. శుక్రవారం రాత్రి పోలీసులు తిరుపతి నగరంలో విస్తృతంగా గాలింపులు జరిపారు. లాడ్జి ల్లో, అనుమానాస్పద ప్రైవేటు భవనాల్లో సోదాలు చేశారు.  కరీంనగర్ జిల్లా చొప్ప గండిలోని ఓ జాతీ య బ్యాంకును ఫిబ్రవరిలో ఉగ్రవాదులు లూటీ చేశారు.



ఆ సొమ్ముతో తిరుపతి నగరంలో భవనా లు, భూములు కొనుగోలు చేసినట్టు ఎన్‌ఐబీ గుర్తించింది. డీజీపీ జేవీ రాముడును ఎన్‌ఐబీ అప్రమత్తం చేసింది. తిరుపతిలో భవనాలను కొనుగోలు చేసి ఉగ్రవాదులు మకాం వేసినట్టు ఎస్‌ఐబీ సమాచారమిచ్చింది. డీజీపీ రాముడు ఆదేశాల మేరకు తిరుపతి అర్బన్, చిత్తూరు ఎస్పీలు గోపీనాథ్‌జెట్టీ, జీ.శ్రీనివాసులు హై అలెర్ట్ ప్రకటిం చారు. చెన్నై, బెంగళూరు జాతీయ రహదారి తిరుపతిలోని ప్రధాన లాడ్జీలు, అనుమానాస్పద ప్రైవేటు భవనాల్లో పోలీసులు సోదాలు చేశారు.



చిత్తూరు ఎస్పీ జీ.శ్రీనివాసులు నేతృత్వంలో మదనపల్లె, చిత్తూరులో పోలీసులు విస్తృతంగా గాలింపులు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు నాకాబందీ నిర్వహించి వాహనాలను సోదాలు చేశారు. గత అక్టోబర్‌లో పుత్తూరులో ఓ ప్రైవేటు భవనంలో మకాం వేసిన తీవ్రవాదులను అక్టోపస్ బృందం పట్టుకున్న నేపథ్యంలో ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందని ఎస్‌ఐబీ హెచ్చ రించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే హై అలెర్‌‌ట ప్రకటించడం గమనార్హం.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top