ఏడు గంటల్లో శ్రీవారి దర్శనం


తిరుమల : తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో ఉంది. సాయంత్రం 6 గంటల వరకు 50,315 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి ఏడు గంటలు, కాలిబాట భక్తులకు 4 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. భక్తులకు గదులు సులభంగా దొరికాయి. మంగళవారం జరిగిన లెక్కింపుల్లో హుండీ కానుకలు రూ.3.01 కోట్లు లభించాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top