3 గంటల్లోనే శ్రీవారి దర్శనం
తిరుమల : తిరుమలలో వారం రోజులుగా నిత్యం కురుస్తున్న వర్షం, విరిగి పడుతున్న కొండ చరియల నేపథ్యం భక్తుల రద్దీపై ప్రభావం చూపిస్తున్నాయి. తమిళనెల పెరటాశి(తిరుమల శనివారాలు)లో నాలుగో శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండాలి. అయితే ఇక్కడి వాతావరణ పరిస్థితులు, విరిగి పడుతున్న కొండ చరియలతో భక్తుల రద్దీ తగ్గిందని నిపుణులు చెబుతున్నారు.
శనివారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 52, 248 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి కేవలం ఏడు కంపార్ట్మెంట్లలో మాత్రమే సర్వదర్శనం భక్తులు వేచి ఉన్నారు. వీరికి 3 గంటలు, కాలిబాట భక్తులకు 2 గంటల్లోనే స్వామి దర్శనం లభించింది. గదులు సులభంగా దొరికాయి. హుండీ కానుకలు రూ.2.55 కోట్లు లభించాయి.