రూ. 3 లక్షల విలువైన కలప స్వాధీనం
రెడ్డిగూడెం: కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రుద్రవరం వద్ద సుమారు రూ.3 లక్షల విలువైన కలపను అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ అధికారులు రావడం గమనించి కలప దొంగలు ట్రాక్టర్లో నుంచి దుంగలను పడేసి ట్రాక్టర్తో పరారయ్యారు. అధికారులు దుంగలను స్వాధీనం చేసుకుని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.