ఆటో బోల్తా: ముగ్గురికి తీవ్రగాయాలు


మద్దిగర్ర: కర్నూలు జిల్లా మద్దిగర్ర మండల శివారులో గుంతకల్లు వెళ్లే రహదారిపై ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తూ ఓ ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో రాజేష్ (34) అనే వ్యక్తికి తీవ్రగాయాలు కాగా.. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కసాపురం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని ఆదోని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top