షిరిడీ వెళ్లి తిరిగి వస్తూ....
- ప్రమాదంలో కర్నూలు వాసులు మృతి
కర్నూలు: మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులు కర్నూలు నగరానికి చెందినవారిగా గుర్తించారు. నగరానికి చెందిన రంజిత్కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో షిర్డీకి వెళ్లారు. దర్శనం పూర్తి చేసుకుని కర్నూలుకు తిరిగి వస్తుండగా వీరి కారు నాందేడ్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో రంజిత్ భార్య అనూరాధ, పెద్ద కుమార్తె హర్షిత, కారు డ్రైవర్ మృతి చెందారు. రంజిత్, కుమారుడు మణి, మరో కుమార్తె తన్విత తీవ్రంగా గాయపడ్డారు. వీరిని నాందేడ్లోని సిటీ ఆస్పత్రికి తరలించారు.