డ్వాక్రా మహిళలు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ


రాజమండ్రి:కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి ఇసుక ర్యాంపు వద్ద శనివారం మధ్యాహ్నం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తొలుత ఇసుక ర్యాంపు నిర్వహణపై 25 శాతం వాటా విక్రయాలు తమకు ఇవ్వాలని డ్వాక్రా మహిళలు ఆందోళన దిగారు. దీనిలో భాగంగానే గతం నుంచి తమకు రావాల్సిన డబ్బులు అందకపోవడంతో నిరసన చేపట్టారు. దాదాపు రూ.3 లక్షల వరకూ తమకు రావాల్సింది ఉందని వారు ఆందోళన చేపట్టారు.


 


దీంతో డ్వాక్రా మహిళల నిరసనను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసే యత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులపై మహిళలు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లకు గాయాలైయ్యాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top