మా వాళ్లు రాజకీయాల్లోకి రావటం ఇష్టం లేదు
సాక్షి, హైదరాబాద్: తన కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రావటం ఇష్టం లేదని పంచాయితీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. రాజకీయాల్లో గతంలో విలువ లు ఉండేవని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలంటే గతంలో ఉండే గౌరవ, మర్యాదలు ప్రస్తుతం లేకుండా పోయాయన్నారు.
గురువారం ఆయన అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎన్టీఆర్ సుజల పథకాన్ని జనవరిలో మరిన్ని కేంద్రాలకు విస్తరిస్తామన్నారు. పథకాన్ని రాష్ర్టం అంతటా నిర్వహించేందుకు టాటా సంస్థ ముందుకు వచ్చిందని, అయితే నిర్వహణ కష్టసాధ్యమనే ఉద్దేశంతో తాము అప్పగించలేదన్నారు.