బడికి వెళ్లొచ్చేసరికి దోచేశారు


పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని వంగాయగూడెం సమీపంలో దొంగలు పట్టపగలే ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. వెంకటరమణ, శ్రీలతాగౌతమి దంపతులు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం వీరు స్కూల్‌కు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి.


ఇంట్లోని రెండు బీరువా తలుపులు కూడా బద్దలు కొట్టి ఉన్నాయి. వాటిల్లోని 30 కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రామారావు, క్లూస్‌టీమ్ సీఐ కె.నరసింహమూర్తి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top