చెన్నకేశవ స్వామి ఆలయంలో చోరీ
పెళ్లకూరు: నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండల కేంద్రంలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి హుండీని బద్దలు కొట్టి అందులోని నగదు ఎత్తుకెళ్లారు. ఉదయాన్నే ఆలయం చుట్టూ ఊడ్చే పనికి వచ్చిన వారు హుండీ పగులగొట్టి ఉండడాన్ని చూసి స్థానికంగా ఉండే టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ మండలి సభ్యుడు హృషి కేశవరావుకు తెలిపారు. ఆయన పోలీసులకు సమాచారం అందించగా... వారొచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుమారు రూ.25వేలు చోరీకి గురైనట్టు చెబుతున్నారు.