మంత్రి గంటా ఇంట్లో చోరీ!

మంత్రి గంటా ఇంట్లో చోరీ!


పరువుపోతుందని ఫిర్యాదు చేయడానికి వెనకడుగు  

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో గురువారం అర్థరాత్రి చోరీ జరిగినట్టు విశాఖలో వార్తలు గుప్పుమన్నాయి. ఎంవీపీ కాలనీ సెక్టార్‌–4లోని గంటా నివాసంలో అర్థరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెనుకవైపు నుంచి ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తులు బుద్ధుడి ప్లాటినం విగ్రహం, ఒక హారం, నెక్లెస్‌ను తీసుకుపోయినట్లు తెలిసింది. అయితే ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఎంవీపీ జోన్‌ సీఐ మళ్ల మహేష్‌ చెప్పారు.



సాక్షాత్తూ మంత్రి నివాసంలోనే దొంగతనం జరగడంతో దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ప్రజల్లో పరువు పోతుందనే భయంతో ఫిర్యాదు చేయలేదని సమాచారం. అయితే కొన్ని వస్తువులే పోవడం, అది కూడా మంత్రి వేరే ఊరు వెళ్లినప్పుడు జరగడంతో ఇంటిదొంగలే ఈ చర్యకు పాల్పడి ఉంటారని అనుమానించి విచారిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top