యువకుడి ఆత్మహత్య


కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పడమటి కోడిపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన నాగరాజు(25) గత కొంతకాలంగా భార్యతో గొడవలు పడుతున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం కూడా వారిద్దరి మధ్య మరో మారు గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన నాగరాజు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top