విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
రుద్రవరం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న లక్ష్మీప్రసన్న(14) అనే విద్యార్థిని ఆత్మాహత్యాయత్నం చేసింది. మరో విద్యార్థినితో గొడవపడి ఇంటికెళ్లి ఒంటిపై కిరోసిన్పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలపాలైన ప్రసన్నను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు