పైకప్పు కూలి - వ్యక్తి దుర్మరణం




ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం ఆత్మకూరు గ్రామంలో ఇంటి పైకప్పు భాగం కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ ఘటన జరిగింది. కృష్ణమూర్తి అనే వ్యక్తి (45) నిద్రలో ఉండగా అర్ధరాత్రి సమయంలో... వర్షానికి బాగా నానిన పైకప్పు కొంత భాగం భాగం ఊడి మీద పడింది. తీవ్రంగా గాయపడిన అతడు మంచంపైనే ప్రాణాలు వదిలాడు. వర్షాలతో ఈ గ్రామానికి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మరోవైపు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్‌లో దాసరి కొండమ్మ (80) చలిగాలులు తట్టుకోలేక ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top