ఫేస్‌బుక్‌లో పూజారి సూసైడ్ నోట్


మదనపల్లె: చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణానికి చెందిన ఓ పూజారి ఫేస్‌బుక్‌లో సూసైడ్ నోట్ పెట్టి అదృశ్యమయ్యాడు. పట్టణంలోని బర్మావీధిలో ఉన్న షిరిడిసాయిబాబా మందిర ప్రధాన అర్చకుడు శివస్వామి నాలుగురోజుల కిందట అదృశ్యమయ్యారు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో శివస్వామి సూసైడ్‌నోట్ వెలుగు చూసింది. తాను పూజించే సాయిబాబా విగ్రహంతో కలసి ఫొటో తీసుకుని ఫేస్‌బుక్‌లో పెట్టినందుకు ఇద్దరు మందలించారని అందులో ఉంది.



అందుకే అందరికీ దూరమవుతూ బాబా దగ్గరకు చేరుతున్నానని దాన్లో పేర్కొన్నారు. ఈ విషయమై టుటౌన్ సీఐ హనుమంత్‌నాయక్‌ను వివరణ కోరగా తమకు ఫిర్యాదు రాలేదని, సుమోటో కేసుగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. చిప్పిలిలో ఉన్న శివస్వామి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top