ఇల్లు కూలి వ్యక్తి మృతి
ఇల్లు కూలి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన వైఎస్సార్ కడప జిల్లా చాపాడు మండలం దాద్రిపల్లి గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కామనూరు రాముడు(29) శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇళ్లు కూలిపోవడంతో.. తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు.
సంబంధిత వార్తలు